amp pages | Sakshi

రెండేళ్లు.. రూ.6 కోట్లు!

Published on Mon, 02/05/2018 - 03:01

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలోని బీదర్‌కు చెందిన భల్కీ గ్యాంగ్‌ అది.. దేవాలయాల్లోని పురాతన పంచలోహ విగ్రహాలే దాని టార్గెట్‌.. రెండేళ్లలో 3 రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో రూ.6 కోట్ల విలువైన 11 విగ్రహాలు తస్కరించింది.. కామారెడ్డిలో రూ.3 కోట్ల విలువైన 3 విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారంలోనే హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. మొత్తం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 

గుడి దొంగల అడ్డా భల్కీ.. 
కర్ణాటక బీదర్‌ జిల్లా సమీపంలోని భల్కీ ప్రాంతం గుడి దొంగలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన పురాతన వస్తువుల స్మగ్లర్లు భల్కీ వాసులకు డబ్బు ఆశ చూపి దొంగలు గా మారుస్తున్నారు. చోరీ చేయడం తేలిక కావడం.. కొనేవారూ సిద్ధంగా ఉండటంతో భల్కీ గ్యాంగ్స్‌ ఏళ్లుగా పల్లె లు, పట్టణ శివార్లలో ని ఆలయాల్లో పురాతన పంచలోహ విగ్రహాలను దొంగతనం చేసి వాటిని ఢిల్లీ, మహారాష్ట్ర ముఠాలకు అమ్మేస్తున్నారు. భల్కీకి చెందిన ముఠాల్లో షేక్‌ హైదర్‌ గ్యాంగ్‌ ఒకటి. గతంలో హైదర్‌ చాంద్రాయణగుట్టలో దినసరి కూలీగా పనిచేశాడు. ఆ సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఖాసింతో పరిచయమైంది. 

కర్ణాటకలో చోరీలు మొదలెట్టి.. 
ఖాసింతో జట్టు కట్టిన హైదర్‌ కర్ణాటకలోని బాగల్‌కోట్, బీజాపూర్‌ల్లోని 3 దేవాలయాల్లో దొంగ తనాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. బెయిల్‌పై బయటకొచ్చిన హైదర్‌ తమ ప్రాంతానికే చెందిన షేక్‌ ఎజాజ్‌తో జోడీ కట్టాడు. కర్ణాటకలో కేసులు ఉండటంతో ఈ ద్వయం మహారాష్ట్రను టార్గెట్‌ చేసుకుంది. గతే డాది ఔరంగాబాద్, లాథూర్‌ జిల్లాలోని ఖిల్లారీ, ఝాన్సీలో దొంగతనాలకు పాల్పడింది. ఈ విగ్రహాలను హైదరాబాద్‌ తీసుకువచ్చి విగ్రహాల స్మగ్లర్లకు నామమాత్రపు ధరకే అమ్మేసింది. మహారాష్ట్రలో నిఘా పెరగడంతో వీరి కన్ను తెలంగాణపై పడింది. 

దోమకొండలో సాధ్యం కాకపోవడంతో 
కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో ఓ పురాతన దేవాలయం ఉన్న విషయం తెలుసుకున్న హైదర్, ఎజాజ్‌ గత శుక్రవారం అక్కడకు చేరుకున్నారు. ఆలయం లోపలకు వెళ్లేందుకు అను మతి లేక తిరిగి వచ్చేశారు. కామారెడ్డిలోనే బస చేసిన ఈ ద్వయం మరుసటి రోజు రాత్రి కామారెడ్డిలోని గోపాలస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామి, రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు తస్కరించి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ దేవాలయానికి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. 

పాత ‘మిత్రుడి’ సమాచారంతో.. 
పాత నేరగాళ్లపై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాంద్రాయణగుట్టలో ఉన్న ఖాసింను పిలిపించారు. సీసీ కెమెరాల ఫీడ్‌లోని అనుమానితుల్ని చూపించగా.. హైదర్‌ను గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఓ లాడ్జిలో బస చేసిన హైదర్, ఎజాజ్‌ ఆదివారం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని తేల్చారు. నిందితులతో పాటు సొత్తును కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)