amp pages | Sakshi

బుసలు కొడుతున్న  కట్టల పాములు

Published on Tue, 04/09/2019 - 05:56

సాక్షి నెట్‌వర్క్‌:  ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నేతలు పూర్తిగా బరితెగించారు. విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో పంపిణీకి సిద్ధంగా ఉన్న టీడీపీ నేతలకు చెందిన రూ.40 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. ‘సాక్షి’  ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గుంటూరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ అగస్టిన్‌ పాల్, అరండల్‌పేట సీఐ బ్రహ్మయ్య తమ బృందాలతో అరండల్‌పేటలోని ఐస్‌క్రీం షాప్‌ యజమాని దేవరపు రవికిరణ్‌ ఇంట్లో నిల్వ ఉంచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అప్రమత్తమైన రవికిరణ్‌ రెండు బ్యాగుల్లో రూ.30 లక్షలకు పైగా నగదును వేరే ప్రాంతానికి తరలించాడు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు సంబంధించినదిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవికిరణ్‌ ఇంట్లో నగదు ఎవరెవరిదగ్గర నుంచి సేకరించారు.. ఎవరెవరికి పంపించాలి అనే వివరాలతో కూడిన నోట్‌బుక్‌ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్‌బుక్‌లో రూ.77.70 లక్షలకు గాను రూ.43.46 లక్షలు టీడీపీకి చెందిన చిట్టిబాబు, గోపి, మాధవ్, నాగేశ్వరరావు, నాగరాజు, విజయ్, ప్రసాద్, వాసులకు  చేరవేసినట్లుగా రాసుకున్నారు. చిట్టిబాబు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రధాన అనుచరుడు. 

టీడీపీ నాయకులకు రూ. 43.46 లక్షలు చెల్లించినట్లు నోట్‌ బుక్‌లో రాసుకున్న రవికిరణ్‌ 

తప్పించే ప్రయత్నాల్లో పోలీసులు 
రవికిరణ్‌ నివాసంలో టీడీపీ నాయకుల పేర్లతో కూడిన నోట్‌ పుస్తకం, రూ.40 లక్షల నగదు పట్టుబడ్డాయి. నగదు పట్టుబడిన సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి రవికిరణ్‌ను రక్షించే పనిలో పడ్డారని తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు డబ్బు పంచేందుకు పలువురు టీడీపీ నేతలకు డబ్బులు చేర్చినట్లు నోట్‌ పుస్తకంలో వివరాలు ఉండటంతో వారిపై పోలీసులతో పాటు ఐటీ అధికారులు దృష్టి సారించారు. 

రాప్తాడులో రూ.2.25 లక్షలు పట్టివేత
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ తరఫున ఆ  పార్టీ నాయకులు రాత్రిపూట గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వేపకుంట సమీపంలో టీడీపీ నాయకులు తమ వాహనాల్లో తరలిస్తున్న రూ.2.25 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

భీమవరంలో రూ.26 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్‌ పోలీసులు సోమవారం స్థానిక అడ్డవంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.26 లక్షలు నగదు పట్టుబడ్డాయి. ఎంవీవీ ముసలయ్య అనే వ్యక్తి మోటార్‌ సైకిల్‌పై ఈ నగదును తీసుకు వెళుతుండగా తనిఖీల్లో దొరికింది.  

4800 చీరలు సిద్ధం చేసిన టీడీపీ నేతలు!
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు గుంటూరు రూరల్‌ మండలంలో టీడీపీ నేతలు సిద్ధం చేసిన 4800 చీరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ గదిలో చీరలు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం  దాడిచేసి  వాటిని స్వాధీనం చేసుకుంది. అయితే టీడీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా కేసు నుంచి తప్పించుకునేందుకు అవి తమవి కాదని చెబుతున్నారని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.

కారులో తరలిస్తున్న రూ.49 లక్షలు సీజ్‌ 
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బ్యాంక్‌ సొమ్ము రూ.49 లక్షలు సోమవారం విశాఖ జిల్లా సబ్బవరం పోలీసులు సీజ్‌ చేశారు. సబ్బవరం మండలం గుల్లేపల్లి జంక్షన్‌ వద్ద వాహనాల్లో సోదాలు నిర్వహించగా ఒక  కారులో రూ.49 లక్షలు పట్టుకున్నారు. కారులో ఉన్నవారిని ప్రశ్నించగా విశాఖ యూకో బ్యాంక్‌ నుండి దేవరాపల్లి యూకో బ్యాంక్‌ శాఖకు తరలిస్తున్నట్లు అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ అఫీసర్‌ డి నాగమల్లిక తెలిపారు. నగదు ట్రాన్స్‌ఫర్‌ లెటర్‌ సైతం చూపించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు రిటర్నింగ్‌ అధికారి అనుమతిపత్రం లేనందున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఎస్‌టి టీమ్‌ ఇన్‌చార్జ్‌ బాబురావు తెలిపారు.  

నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ప్రలోభాల వల
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు భారీ ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల ముందస్తు సమాచారంతో పోలీసులు వారిని పట్టుకుంటున్నారు. సోమవారం రూ.12 లక్షలకు పైగా నగదు, 1500కు పైగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో ఆదివారం రాత్రి ఎస్సీలపై దాడి చేసిన ఘటన మరువకముందే  ఓట్లకు డబ్బులు తీసుకోలేదన్న అక్కసుతో టీడీపీ నాయకులు ఎస్టీలపై దౌర్జన్యానికి దిగారు. సోమవారం రాత్రి కాలనీలో ఓట్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు టీడీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మాకు ఎలాంటి నగదు వద్దు, మాకు నచ్చిన పార్టీకి ఓట్లు వేస్తామని కాలనీ వాసులు చెప్పగా, వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్లి, స్థానిక టీడీపీ నాయకులకు చెప్పారు. దాంతో సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాలనీకి చేరుకొని ఓట్లకు డబ్బులు తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. కాలనీ వాసులు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు ఎïస్టీలను కులం పేరుతో తిడుతూ నానా దుర్భాషలాడారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలపై భౌతిక దాడులకు దిగారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భీమవరంలో ఓటర్లకు జనసేన ఎర
భీమవరంలో ఎన్నికల ప్రచారంలో వెనుకబడ్డ జనసేన అధినేత పవన్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు పంపిణీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకు రూ.1000  చొప్పున సోమవారం నుంచి పంపకం మొదలుపెట్టారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తామేమి తక్కువ తినలేదన్నట్లు ఓటుకు రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడం వల్లే ఓటర్లను ఆకట్టుకోడానికి డబ్బు పంపిణీ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)