పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...
Breaking News
హొసూరు చెరువులో దంపతుల మృతదేహాలు
Published on Mon, 07/01/2019 - 08:22
కర్ణాటక , హొసూరు: హొసూరు సమీపంలోని దర్గా చెరువులో శనివారం పోలీసులు ఇరువురి మృతదేహాలను స్వాధీనపరుచుకొన్నారు. హొసూరు– బెంగళూరు జాతీయ రహదారి దర్గా వద్దగల చెరువులో శనివారం ఉదయం స్త్రీ, పురుషుని మృతదేహాలు తేలినట్లు స్థానికులు హొసూరు పట్టణ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు తమిళనాడులోని కాంచీపురం జిల్లా నెయ్కుప్పి గ్రామానికి చెందిన సుబ్రమణి కొడుకు కణ్ణన్ (30), అతని భార్య కల్పన (25) అని తెలిసింది. కణ్ణన్ బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు, గత 26వ తేదీ స్వగ్రామం నుంచి భార్య, రెండేళ్ల కూతురుతో కలిసి బెంగళూరుకు బయలుదేరినట్లు తెలిసింది. బెంగళూరుకు వెళ్లవలసిన వీరు హొసూరుకు ఎందుకొచ్చారు, హొసూరులో ఆత్మహత్య చేసుకొన్నారా లేక ఎవరైనా హత్య చేసి పడేశారా? రెండేళ్ల పాప ఏమయ్యింది అన్నది మిస్టరీగా మారింది. ఈ సంఘటనపై హొసూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Tags