amp pages | Sakshi

హొసూరు చెరువులో దంపతుల మృతదేహాలు

Published on Mon, 07/01/2019 - 08:22

కర్ణాటక , హొసూరు: హొసూరు సమీపంలోని దర్గా చెరువులో శనివారం పోలీసులు ఇరువురి మృతదేహాలను స్వాధీనపరుచుకొన్నారు. హొసూరు– బెంగళూరు జాతీయ రహదారి దర్గా వద్దగల చెరువులో శనివారం ఉదయం స్త్రీ, పురుషుని మృతదేహాలు తేలినట్లు స్థానికులు హొసూరు పట్టణ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనపరుచుకొని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు తమిళనాడులోని కాంచీపురం జిల్లా నెయ్‌కుప్పి గ్రామానికి చెందిన సుబ్రమణి కొడుకు కణ్ణన్‌ (30), అతని భార్య కల్పన (25) అని తెలిసింది. కణ్ణన్‌ బెంగళూరులోని ప్రైవేట్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు, గత 26వ తేదీ స్వగ్రామం నుంచి భార్య, రెండేళ్ల కూతురుతో కలిసి బెంగళూరుకు బయలుదేరినట్లు తెలిసింది. బెంగళూరుకు వెళ్లవలసిన వీరు హొసూరుకు ఎందుకొచ్చారు, హొసూరులో ఆత్మహత్య చేసుకొన్నారా లేక ఎవరైనా హత్య చేసి పడేశారా? రెండేళ్ల పాప ఏమయ్యింది అన్నది మిస్టరీగా మారింది. ఈ సంఘటనపై హొసూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని తీవ్ర విచారణ జరుపుతున్నారు.

Videos

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)