amp pages | Sakshi

తాగిన మైకంలో దాడి

Published on Sat, 12/29/2018 - 07:51

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: కాకినాడ నగరం రెండో డివిజన్‌లోని బొందగుంటలో ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో శుక్రవారం చేసిన దాడిలో ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గంటా పెద్దిరాజు (35) మరణించగా, కుండల ఆదినారాయణ, గంటా మహాలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. కుండల ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహాలక్ష్మికి తలపై గాయమైంది. వివరాలు ఇలా ఉన్నాయి... కాకినాడ రూరల్‌ మండలం వలసపాకల బొందగుంటకు చెందిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు మద్యం మత్తులో వారి పెద్దనాన్న కుండల ఆదినారాయణ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. తాగి గొడవ చేస్తారన్న భయంతో ఆదినారాయణ తన ఇంటి పక్కనే ఉంటున్న అల్లుడు గంటా పెద్దిరాజును పిలిచాడు. అల్లుడు వచ్చేలోపు తలుపు తీసుకొని బయటకు వచ్చిన కుండల ఆదినారాయణను తలపై ఇనుపరాడ్డుతో కొట్టారు.

మామగారిపై దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన గంటా పెద్దిరాజును రాడ్లతో తలపై బలంగా కొట్టారు. అక్కడే ఉన్న పెద్దిరాజు తల్లి మహాలక్ష్మిపై కూడా దాడి చేశారు. దాడిలో పెద్దిరాజు తీవ్రంగా గాయపడగా కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయిన కుండల ఆదినారాయణకు, గాయపడిన మహాలక్ష్మికి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యం అందజేస్తున్నారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అసలు తమ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవని, వీరు మద్యం తాగి వచ్చి ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?