సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూతురిపై అనుమానం.. పరువు హత్య..!
Published on Sat, 06/30/2018 - 17:18
సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతుర్ని గొడ్డలి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కూతురిపై అనుమానంతో తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
ఆ యువతి(22) బీఫార్మసీ చదువుతోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags