amp pages | Sakshi

అజ్ఞాతంలో ఉన్నా పసిగట్టారు

Published on Tue, 06/25/2019 - 08:13

సాక్షి, సిటీబ్యూరో: బిట్‌ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ పేరు వాడుకుని నగరంలో భారీ మోసానికి పాల్పడిన గర్దాస్‌ రమేష్‌పై బెంగళూరులోనూ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌కు పాల్పడ్డాడు. మూడేళ్ళ క్రితం కేసు నమోదు చేసిన అక్కడి అశోక్‌నగర్‌ పోలీసులు రమేష్‌తో పాటు ముగ్గురు హైదరాబాదీయుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ తీసుకున్న రమేష్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఇతడిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. అతడి ఆచూకీ తెలుసుకున్న వచ్చిన బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. సోమవారం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. గర్దాస్‌ రమేష్‌ను గత ఏడాది హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మరో నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు ఇతడిపై రిజిస్టర్‌ అయిన కేసుల సంఖ్య 18కి చేరింది. వీటిలో నాలుగింటిలో రమేష్‌ ఇంకా వాంటెడ్‌గా ఉన్నాడు.

బోయిన్‌పల్లి కేంద్రంగా కాయినెక్స్‌ట్రేడింగ్‌ పేరుతో విదేశాల నుంచి నిర్వహిస్తున్నట్లు ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించిన రమేష్‌ దీని ఆధారంగా రంగంలోకి దిగాడని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు నలుగురు దళారుల్ని ఏర్పాటు చేసుకుని పలువురిని ఆకర్షించాడు. తమ స్కీముల్లో పెట్టుబడి పెడితే కనిష్టంగా 134 రోజుల నుంచి గరిష్టంగా 500 రోజుల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందని ప్రచారం చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1200 మంది నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి నిండా ముంచాడు. ప్రధాన సూత్రధారి రమేష్‌తో సహా ఐదుగురు నిందితుల్ని హైదరాబాద్‌ పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  కామారెడ్డి జిల్లా దొనకొండకు చెందిన గర్దాస్‌ రమేష్‌ 25 ఏళ్ళ క్రితం నగరానికి వలసవచ్చాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పలు మోసాలు చేశాడు. వాటికి కొనసాగింపుగా బెంగళూరులో వన్‌ కాయిన్‌ అనే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం చేశాడు.

దీంతో ఇతడితో పాటు కట్టంగూరి వెంకట్‌రెడ్డి, పల్లా కుమార్‌ యాదవ్, పోతు కనకరాజు తదితరులపై అక్కడి అశోక్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయిన వీరు బెయిల్‌పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కేసు వాయిదాలకు హాజరుకాకపోవడంతో వీరిపై న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూలు జారీ చేసింది. అయినప్పటికీ వీరి ఆచూకీ చిక్కకపోవడంతో అశోక్‌నగర్‌ పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరకు శనివారం ప్రధాన నిందితుడు గర్దాస్‌ రమేష్‌ను కనిపెట్టి అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. మరోపక్క గత ఏడాది ఇతగాడిపై విశాఖపట్నంలోని గాజువాక ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా బోయిన్‌పల్లిలో మరో రెండు రిజిస్టర్‌ అయ్యాయి.  ఈ నాలుగింటిలోనూ రమేష్‌ వాంటెడ్‌గా ఉండటంతో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌