amp pages | Sakshi

‘ఎలక్ట్రానిక్‌’ మోసం.. 70 శాతం ఆఫర్‌

Published on Mon, 09/09/2019 - 11:31

సనత్‌నగర్‌: వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇస్తామని వినియోగదారుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసిన ఆన్‌లైన్‌ సంస్థ నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను నిలదీస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బేగంపేట ప్రకాష్‌ నగర్‌లోని అద్‌నాన్‌ ఛాంబర్స్‌లో ‘హిమోగల్‌ టెక్నాలజీ సంస్థ’ఈ ఏడాది జులై 29న ప్రారంభమైంది. దీనికి మహ్మద్‌ తస్లీమ్‌ సయీద్, ఆదిత్యలు యజమానులుగా ఉన్నారు. వీరు కాల్‌ సెంటర్‌ మార్కెటింగ్‌ పేరిట సుమారు 90 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఉద్యోగంలో చేరే సమయంలో వీరికి కాల్‌ సెంటర్, ఈవెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పనులు ఉంటాయని చెప్పారు. తీరా విధుల్లోకి చేరాక ప్రజలకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను విక్రయించే పనిని అప్పగించారు.

మొదట్లో ఉద్యోగులకు వస్తువులపై 70 శాతం ఆఫర్‌ ప్రకటించి, దీని కోసం ‘వావ్‌ జీ యాప్స్‌’ పేరిట ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కస్టమర్లు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల కోసం ఆర్డర్లు చేశారు. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించగా, కొందరు సంస్థ కార్యాలయానికి వచ్చి నగదు చెల్లించి వస్తువులు బుక్‌ చేసుకున్నారు. నెల రోజుల్లోనే సుమారు 1,500 ఆర్డర్లు వచ్చాయి. వచ్చిన ఆర్డర్లలో 50 నుంచి 100 వరకు చిన్న చిన్న వస్తువులను అందజేశారు. ఆ తరువాత ఆర్డర్‌ చేసిన వస్తువులు పంపకుండా నిర్వాహకులు జారుకున్నారు.  దీంతో ఏం చేయాలో తెలియక హిమోగల్‌ టెక్నాలజీ సంస్థ ఉద్యోగులు ఆదివారం బేగంపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సంస్థ నిర్వాహకుడు తస్లీమ్‌ సయీద్‌ను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు ఆదిత్య పరారీలో ఉన్నాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)