amp pages | Sakshi

అన్నయ్య వరసయ్యే వ్యక్తి భార్యతో..

Published on Wed, 09/05/2018 - 12:25

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సమీప బంధువు భార్యతో ఆ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్వారీలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట వస్తున్న యువకుడిని ఆగంతకులు దారికాచి మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు.

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: క్వారీలో విధులు నిర్వర్తించి తిరిగి వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారు జామున మండలంలో జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం, గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేట పట్టణంలో నివసిస్తున్నాడు. యడవల్లిలోని గ్రానైట్‌ క్వారీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం తెల్లవారు జామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై కోటప్పకొండ – చిలకలూరిపేట ఆర్‌ అండ్‌ బీ రహదారిపై నుంచి చిలకలూరిపేట పట్టణం వైపు వస్తున్నాడు. యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద పెద్ద బండరాయి వద్ద కాపు కాచిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేయడంతో అంజనీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల కిందటే వివాహమైంది. సమాచారం తెలుసుకున్న సర్కిల్‌ సీఐ యు.శోభన్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నయ్య వరసయ్యే వ్యక్తే హతమార్చాడు!?
మృతుడు అంజనీరాజుకు గురిజేపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య వరసయ్యే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏడాది కిందట అన్నా వదినలను విడదీసిన మృతుడు, చిలకలూరిపేట పట్టణంలో మరో గృహంలో వదినతో  నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అనేక విడతలు సంఘ పెద్దలు, గ్రామస్తుల వద్ద పంచాయితీలు పెట్టారని సమాచారం. దీంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్న అన్న మరో ఇద్దరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఫిర్యాదులో అనుమానితులుగానిందితుల పేర్లు!
మృతుడి తమ్ముడు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించే నూతలపాటి హరికృష్ణ పోలీసులకు అందించిన ఫిర్యాదులో సైతం అన్నయ్య వరుసయ్యే వ్యక్తితో  పాటు మరో ఇద్దరి వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రూరల్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సీఐను ప్రశ్నించగా, కేసును విచారిస్తున్నామని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)