రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్య మొబైల్ వాడుతోందని..
Published on Tue, 08/06/2019 - 10:36
రాయ్పూర్ : మొబైల్ ఫోన్ వాడవద్దని పలుమార్లు చెప్పినా వినలేదనే కోపంతో భార్యను కత్తితో పొడిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. చత్తీస్గఢ్లోని కంకేర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేయడమే కాకుండా తన మాట పెడచెవిన పెడితే విడాకులు ఇస్తానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని భర్త బెదిరింపులకు దిగాడు. మొబైల్ ఫోన్ వాడొద్దని తన భర్త తరచూ తనను వేధిస్తున్నాడని, మూడు రోజుల కిందట తనపై భౌతిక దాడికి దిగాడని బాధితురాలు వెల్లడించారు.
అదే రోజు ఆయన కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని చెప్పారు.తన మాట వినకుంటే విడాకులు ఇస్తానని తన భర్త తన తల్లితండ్రులనూ బెదిరించాడని అన్నారు. చిన్న విషయాల్లోనూ భర్తత తనతో కీచులాటకు దిగుతాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య వాపోయారు.
#
Tags