amp pages | Sakshi

ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి 

Published on Sun, 05/26/2019 - 02:03

సిద్దిపేట కమాన్‌: నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన తల్లే తన బిడ్డల ప్రాణాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తి తన కొడుకుల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసా, కత్తితో పేగులు బయటకు వచ్చేలా కడుపులో పొడిచి అత్యంత పాశవికంగా అంతమొందించింది. అనంతరం కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది.

శనివారం సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల భాస్కర్, సరోజ ఆరున్నర సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో కొన్నాళ్ల పాటు వీరు కరీంనగర్‌లో ఉన్నారు. వీరికి ఆయాన్‌ (బిట్టు) (5), హర్షవర్ధన్‌(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దికాలం తర్వాత ఈ దంపతులు సిద్దిపేట పట్టణానికి వచ్చి గణేశ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

భాస్కర్‌ కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, భాస్కర్‌కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య, భాస్కర్‌పై రెండో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టడంతో కొద్ది సంవత్సరాలు వాదోపవాదనలు జరిగిన అనంతరం ఈ మధ్య భాస్కర్‌కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. భాస్కర్, సరోజకు ఇదే విషయంలో గత కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భాస్కర్‌ ఇంట్లో లేని సమయంలో శనివారం మధ్యాహ్నం సరోజ తన ఇద్దరు పిల్లలను బీరు సీసా, కత్తితో అత్యంత దారుణంగా కడుపులో పొడిచి చంపింది.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, వన్‌ టౌన్‌ సీఐ నందీశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లల తండ్రి భాస్కర్‌ మృతదేహాలను చూసి భోరున విలపించాడు. కాగా, కొడుకులను చంపి సరోజ కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనపై సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)