వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులపై గిరిజనుల దాడి
Published on Sun, 03/10/2019 - 18:55
యాదాద్రి భువనగిరి జిల్లా: రాజుపేట్ మండలం పుట్టగూడెం తండాలో ఎస్ఓటీ పోలీసులపై స్థానిక గిరిజనులు దాడి చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తోన్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాక గమనించిన గిరిజనులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు సుబ్బరాజు, సంజీవ రెడ్డి, ఎస్ఐ సురేందర్ రెడ్డిలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో సుబ్బరాజు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. పోలీసులపై దాడి చేసే సమయంలో ఆధారాలు లేకుండా చేసేందుకు పీడీఎస్ బియ్యపు బస్తాలపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags