అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
గర్భిణి ఆత్మహత్య
Published on Wed, 07/10/2019 - 09:06
భాగ్యనగర్కాలనీ: నిండు గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసాపేట, సఫ్దార్నగర్కు చెందిన ఖాసీంబీ (20) మహ్మద్ అక్బర్ భార్యాభర్తలు. అక్బర్ బోరబండలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరి ఒక కుమారుడు అబ్బు సోఫియా ఉండగా ఖాసీంబీ ప్రస్తుతం గర్భవతి. అయితే గత కొంత కాలంగా భర్తతో పాటు అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మనస్తాపానికిలోనైన ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా తమ కుమార్తెను ఆమె అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్తతో సహాఅత్త, మామ, ఆడబిడ్డలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags