amp pages | Sakshi

లంచం.. నిర్బంధం

Published on Wed, 05/01/2019 - 10:22

కర్ణాటక, తుమకూరు:   బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏకంగా కోర్టు ఆవరణలోనే లంచం తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు పట్టిబడ్డారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలుకా న్యాయాలయం ఆవరణలో మంగళవారం చోటుచేసుకుంది. కేఇబీ ఇంజనీర్‌ గురుబసవ స్వామినుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పీపీ పూర్ణిమను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. 

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2015వ సంవత్సరంలో జిల్లాలో భారీగా వచ్చిన ఈదురు గాలులకు, వర్షాలకు కూలిపోయిన చెట్లు, కరెంట్‌ స్తంభాలను తొలగించడానికి అటవీ శాఖ, బెస్కాం అధికారులు పనులు చేపట్టారు. ఆ పనుల్లో వృద్ధుడు ఒకరు అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా గాయపడటం జరిగింది. దాంతో ఆయన కుటుంబసభ్యులు అటవీ శాఖ, బెస్కాం అధికారులపైన తిపటూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

రూ.40వేలకు ఒప్పందం  
ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా పనిచేయాలంటే సొమ్ము ముట్టజెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న పూర్ణిమా రూ. రూ.40 వేలను అటవీ, విద్యుత్‌ అధికారులను డిమాండు చేశారు. అందులో బాగంగా బెస్కాం ఇంజనీర్‌ గురుబసవ స్వామి ఇప్పటికే పూర్ణిమా బ్యాంకు ఖాతాలో రూ. 20 వేలను వేశారు. మిగిలిన రూ. 20 వేలను మంగళవారం కోర్టు ఆవరణలో పూర్ణిమాకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వచ్చి నగదుతో పాటు పూర్ణిమాను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె చిక్కమగళూరులో, కడూరులో విధులు నిర్వహించినప్పుడు కూడా అవినీతికి పాల్పడిన కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)