amp pages | Sakshi

చల్లగాలి కోసం కిటికీ తీస్తే..

Published on Mon, 04/23/2018 - 10:44

రాజేంద్రనగర్‌: చల్లటి గాలికోసం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న కిటికీని తెరిచి ఉంచగా ఆ కిటికీలోంచి దొంగలు దూరి ఇల్లును కాజేసిన ఘటన  నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన కొత్త జంట విజయ్, అనూష. వీరిద్దరికి 20 రోజుల కిందట వివాహమవడంతో హైదర్షాకోట్‌లోని మాధవీనగర్‌లో కొత్త కాపురం పెట్టారు. స్థానికంగా వీరి బంధువులు ఉండడంతో ఇంటిని కోనుగోలు చేసి నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్‌ శనివారం ఉద్యోగానికి వెళ్లి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు భోజనాలు పూర్తిచేసుకొని నిద్రపోయారు.

వేడి ఎక్కువగా ఉండడంతో తలుపు పక్కనే ఉన్న కిటికీని చల్లగాలి కోసం తెరిచి ఉంచారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విజయ్‌కి ఫోన్‌ రావడంతో బయటకు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. బయట నుంచి గడియ ఉండడంతో పక్క ఇంట్లోని బంధువులకు ఫోన్‌చేసి గడియ తీయించాడు. అయితే ఆ తర్వాత లేచిన అనూష బాల్కాని పక్కనే ఖాళీ స్థలంలో తన ఆభరణాల ఖాళీ డబ్బాలు పడి ఉండడంతో గమనించింది. వెంటనే భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగింది అని గ్రహించి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. మాదాపూర్‌ డీసీపీ వెంకట్‌రావు, ఏసీపీ శ్యామ్‌సుందర్‌తో పాటు క్లూస్, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్లంబర్‌పై అనుమానం
అయితే ఈ దొంగతనానికి పాల్పడింది ప్లంబర్‌ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ శనివారం మధ్యాహ్నం ఓ ప్లంబర్‌ను పిలిపించి బాత్‌రూమ్‌లో వాటర్‌ హీటర్‌ను బిగించే పనిని చెప్పాడు. పనులు చేసి వెళ్లిన ప్లంబర్‌పైనే అనుమానం ఉందని విజయ్‌ తెలిపాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)