amp pages | Sakshi

వృద్ధ దంపతులను నిర్బంధించి..

Published on Wed, 02/13/2019 - 08:37

తూర్పుగోదావరి, కడియం (రాజమహేంద్రవరం రూరల్‌): కడియపులంకల పరిధిలో హైవేపై హోటల్‌ నిర్వహిస్తున్న వృద్ధ దంపతులను నిర్బధించి వారి వద్ద రూ.49 వేలు సహ రూ.1.14 లక్షల సొత్తును చోరీ చేసి ఇద్దరు ఉడాయించారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం ఈ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు పెనుమాక సత్యనారాయణమ్మ, నాగేశ్వరరావు దంపతులు, పోలీసుల కథనం ప్రకారం.. కడియపులంకలోని హైవేపై గంగుమళ్ల నర్సరీ సమీపంలో బాధితులు హోటల్‌ నిర్వహిస్తున్నారు. పనులు ముగించుకుని సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రకు ఉపక్రమించారు.

ఆ సమయంలో సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు యువకులు వీరు ఉండే పాకలోకి ప్రవేశించి వారిద్దరినీ కదలకుండా పట్టుకున్నారు. సత్యనారాయణమ్మ మెడలో ఉన్న మూడు కాసుల పుస్తెల తాడు, చెవి లోలకులను బలవంతంగా తీసేసుకున్నారు. పుస్తెల తాడుకు ఉన్న తాళంతో గళ్లా పెట్టె తెరిచి రూ.49 వేలు, చెవి లోలకులు, రెండు ఉంగరాలు, సెల్‌ఫోన్, రెండు కోడిపుంజెలను చోరీ చేశారు. బలవంతంగా లాక్కుపోయాని సత్యనారాయణ విలపించింది. వృద్ధుడు కొంతకాలంగా అస్వస్థతతో ఉండడంతో హోటల్‌ను కూడా సరిగ్గా తీయడం లేదు. ఆస్పత్రికి తీసుకువెళతామన్న ఉద్దేశంతో పోస్టాఫీసులో దాచుకున్న రూ.30 వేలు, ఇద్దరి వద్ద అప్పు చేసిన రూ.19 వేలను దుండగులు పట్టుకుపోయారని వారు వాపోయారు. ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసిన తరువాత మంగళవారం ఉదయం వారు పోలీసులను ఆశ్రయించారు. కడియం ఎస్సై బీవీ సుబ్బారావు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుల వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధులకు తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?