amp pages | Sakshi

ముసుగు దొంగల హల్‌చల్‌

Published on Sun, 07/14/2019 - 15:52

సాక్షి, విజయవాడ : నగరంలో ముసుగుదొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం గోడౌన్‌లోకి చొరబడి హల్‌చల్‌ చేశారు. గుమాస్తాపై దాడిచేసి కౌంటర్‌లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను అపహరించుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ సంఘటనతో బిజినెస్‌ హబ్‌గా పేరుగాంచిన పాతబస్తీ పరిధిలోని ఇస్లాంపేటలో కలకలం రేగింది. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి  ఇస్లాంపేటలోని ప్రగతి ట్రాన్స్‌పోర్ట్‌ గోడౌన్‌లోకి అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడ ఉన్న గుమాస్తా పాండేని డబ్బులు ఇ‍వ్వాల్సిందిగా బెదిరించారు. అతను ప్రతిఘటించడంతో కర్రలతో దాడిచేసి గాయపరిచారు. కౌంటర్‌లో ఉన్న నాలుగు లక్షల రూపాయలను తీసుకొని పారిపోయారు. సమాచరం అందుకున్న గోడౌన్‌ యజమాని వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన గుమస్తా పాండేని ఆస్పత్రిలో చేర్పించి, కొత్తపేట పోలీసులకు పిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముసుగు దొంగలు ఎవరు? కౌంటర్‌లో డబ్బు రెడీగా ఉందనే విషయం వారికి ఎలా తెలిసింది? గుమాస్తా చెప్సే కథలో నిజమెంత? ఆ ముగ్గురికీ, గుమాస్తా పాండేకు లింకులేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని డీసీపీ విజయరామారావు పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని సంఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై డీసీపీ మాట్లాడుతూ సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, దోపిడీకి ముందు నిందితులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించామని తెలిపారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు విచారణను వేగవంతం చేశామని పేర్కొన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)