రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యూరియా కలిసిన నీరుతాగి గొర్రెలు మృతి
Published on Wed, 03/21/2018 - 16:25
నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ మండలం తీగల్పహాడ్ పంచాయతీ పరిధిలోని సంఘంమల్లయ్య పల్లెకు చెందిన పొనవేణి గట్టయ్యకు చెందిన 16 సబ్సిడీ గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. ఎఫ్సీఐ గోదాముల వద్ద యూరియా కలిసిన నీటిని గొర్రెలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. గోదాముల్లో కింద పడిన యూరియాను పారవేయకుండా నీరుపోసి శుభ్రం చేయడంతో ఆ నీరు బయటకు వచ్చి నిలిచి ఉండడంతో గొర్రెలు తాగి చనిపోయాయని పేర్కొన్నాడు.
గొర్రెలను మండల సహాయ పశు వైద్యురాలు పద్మ పరిశీలించారు. పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. మంగళవారం సాయత్రం మంచిర్యాల పశు వైద్యాధికారి ఎం.భూమయ్య, వైద్యులు సిద్దు పవార్, సంతోష్, పద్మలు గ్రామంలోని మిగతా గొర్రెలకు చికిత్స అందించారు.
#
Tags