amp pages | Sakshi

మరోసారి విచారణ!

Published on Tue, 11/06/2018 - 04:32

సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును మరో వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మరో పిటిషన్‌ను వేసింది. హత్యాయత్నం జరిగిన తరువాత ఆరు రోజుల పాటు తమ కస్టడీలో చెప్పుకోతగ్గ విషయాలను రాబట్టలేకపోయామని భావిస్తున్న సిట్‌ అధికారులు శ్రీనివాసరావును మరోసారి విచారించాలని నిర్ణయించారు. శనివారం కస్టడీ ముగియగానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చే సమయంలో కస్టడీ పొడిగింపు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో సిట్‌ అధికారులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని కోర్టు దీపావళి తర్వాత రెండు మూడురోజుల్లో విచారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

పక్కాగానే హత్యాయత్నం
నిందితుడు శ్రీనివాసరావు కొన్ని నెలలుగా పక్కా ప్రణాళిక వేసుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఒడిగట్టాడని సిట్‌ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ముందుగా ప్రచారంలోకి వచ్చినట్టు అతనికి ఎలాంటి మానసిక వైకల్యం లేదని, పూర్తి ఆరోగ్యవంతుడని సిట్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆరురోజుల పాటు కస్టడీ సమయంలో వివిధ కోణాల్లో విచారించిన విషయాలను పరిశీలించగా.. శ్రీనివాసరావు చెప్పిన విషయాలన్నీ ముందే తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే  చెప్పినవని పోలీసులు గుర్తించారు. సాధారణ నేరస్తులు కస్టడీలో కొన్ని అంశాలపై పొంతన లేని సమాధానాలు చెప్పి దొరికిపోతారు. కానీ పక్కా కరుడుగట్టిన, కిరాయి హంతకులే ఇంత పక్కాగా కస్టడీ విచారణలోనూ పోలీసులను పక్కదారి పట్టించగలరని చెబుతున్నారు. శ్రీనివాసరావు తీరు కూడా అదే విధంగా ఉండడం సాధారణ విషయంకాదని ఓ ఉన్నతాధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు.  

శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేదు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ న్యాయవాది అబ్దుల్‌ సలీం విశాఖ 3వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అభ్యర్థిస్తూ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై జైలు సూపరింటెండెంట్‌ వద్దకు వెళ్లాలని సూచించారు. న్యాయవాది సలీం నిందితుడు శ్రీనివాస్‌ను  శనివారం జైలులో ములాఖత్‌లో కలిశారు. 

నిందితుడి ఆరోగ్యం బాగుందన్న వైద్యులు..
నిందితుడు శ్రీనివాస్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కేజీహెచ్‌ వైద్యులు కస్టడీ సమయంలో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించి నిర్ధారించారు. కస్టడీలోకి తీసుకున్న మూడో రోజు గుండెలో నొప్పిగా ఉందని నిందితుడు పేర్కొనడంతో తొలుత ప్రైవేట్‌ వైద్యుడితో స్టేషన్‌లో పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం కేజీహెచ్‌కు తరలించి బీపీ, షుగర్, పల్స్‌ కార్డియాక్‌ పరీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత రోజూ కేజీహెచ్‌ వైద్యుల్ని రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన ప్రతిసారీ నిందితుడు శ్రీనివాస్‌ నూటికి నూరు శాతం ఫిట్‌గా ఉన్నాడని, అతడి మానసిక పరిస్థితి కూడా బాగుందని వైద్యులు మీడియా ఎదుటే చెప్పారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరు పర్చే సమయంలో కూడా నిందితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడంటూ కేజీహెచ్‌ వైద్యులు ఇచ్చిన మెడికల్‌ సర్టిఫికెట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. నిందితుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అతడికి మతిస్థిమితం లేదని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మానసికంగా ధృఢంగా ఉన్నాడని, ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా చెబుతున్నాడని విచారణాధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, మానసిక వైద్యులతో పరీక్షించాలంటూ సీఆర్‌పీసీ 65ఏ కింద పిటిషన్‌ దాఖలు కావడం గమనార్హం. 

సామాజిక బాధ్యతతోనే పిటిషన్‌ వేశా..
‘సామాజిక బాధ్యతతోనే ఉచితంగా ఈ కేసులో వాదించాలని నిర్ణయించుకున్నా. నన్ను బయటకు తీసుకురావద్దు. జైలులోనే ఉంటా. ఇక్కడే బాగుంటుందని నిందితుడు చెప్పాడు. అయితే బెయిల్‌ కోసం ఒప్పించి నిందితుడి అనుమతితోనే పిటిషన్‌ వేశా. అతడి కుటుంబ సభ్యులతోనూ ఫోన్‌లో మాట్లాడా.’
– అబ్దుల్‌ సలీం, న్యాయవాది

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)