వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఆటో బోల్తా : విద్యార్థులకు గాయాలు
Published on Fri, 01/25/2019 - 12:49
అనంతపురం, మడకశిరరూరల్: ఉప్పిడిపల్లి సమీపంలో ప్రధాన రోడ్డుపై గురువారం ఉదయం ప్రమాదవశాత్తు అటో బోల్తా పడడంతో 10 మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. మణూరు పంచాయితీలోని వివిధ గ్రామాల విద్యార్థులు మడకశిరలోని ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలలకు అటోలో బయలుదేరారు. ఉప్పిడిపల్లి సమీపంలో ఉన్నఫళంగా అటో అదుపు తప్పి బోల్తా పడడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా మణూరు పంచాయితీలోని వివిధ గ్రామాలను దాదాపు 40 మంది విద్యార్థులు రోజూ కళాశాలలకు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గత్యంతరం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, అర్టీసీ అధికారులు బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Tags