amp pages | Sakshi

ఇళ్ల స్థలాలకు భూమిచ్చారని దాడి 

Published on Sat, 07/04/2020 - 08:38

క్రోసూరు (పెదకూరపాడు): గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఘాతుకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పేదలకిచ్చే ఇంటి స్థలాల నిమిత్తం ప్రభుత్వానికి పొలం ఇచ్చిన రైతులపై టీడీపీ కార్యకర్తలు గడ్డ పలుగుతో దాడి చేసిన ఘటన క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు శ్రీనివాసరావు, అతని అల్లుడు కంకణంపాటి శ్రీధర్‌ కథనం మేరకు.. బాలెమర్రు గ్రామంలోని ఎస్సీలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు శ్రీనివాసరావు, శ్రీధర్‌ 1.23 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు.

ఈ పొలంలో సర్వేయర్, సహాయకులు వచ్చి శుక్రవారం సాయంత్రం కొలతలు వేసి.. మార్కింగ్‌ చేస్తుండగా పక్క పొలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ముసులూరి సాంబశివరావు, ముసులూరి కృష్ణారావు, బొబ్బా వెంకటేశ్వరావు, బొబ్బా రాధాకృష్ణ, తాళ్లూరి లక్ష్మీనారాయణ వచ్చి ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం పొలం ఎందుకిచ్చారంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గడ్డ పలుగుతో దాడి చేశారు. దీంతో శ్రీనివాసరావు, శ్రీధర్‌ భయపడి పారిపోయారు. అనంతరం వారిద్దరూ కారులో ఎస్సీ కాలనీకి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గడ్డపలుగుతో కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు చప్పిడి శ్రీను, మల్లెల హరి, పెద్దింటి దేవునిదయ, మేళం థామస్‌తో కలిసి బాధితులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
(చదవండి: బినామీ ‘బాబు’కు చెక్‌

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)