amp pages | Sakshi

రాలిన విద్యాసుమం

Published on Fri, 02/16/2018 - 12:15

రోజూలాగే పాఠశాలకు సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరిన ఆ చిన్నారిని మృత్యువు ట్రాన్స్‌కో వ్యాను రూపంలో బలిగొంది. పాఠశాలకు సహచర విద్యార్థినిలతో బయలుదేరిన ఆ చిన్నారి అంతలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కొల్పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుపై ఆసక్తితో కన్నతల్లిని వీడి పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్న ఆ చిన్నారిని మృత్యువు కబళించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చదువు కోసం పెద్దమ్మ దగ్గర ఉంచితే ఇలా చేశావా! దేవుడా!!అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

బాడంగి:  మండల కేంద్రంలోని ఎత్తుఖానా సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగిరెడ్డి పార్వతి(15) అనే పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మండలంలోని పిన్నవలసకు చెందిన పార్వతి చదువు నిమిత్తం డొంకినవలసలోని పెద్దమ్మ గంటి శకుంతల ఇంటి వద్ద ఉంటోంది. ఇక్కడ నుంచే సైకిల్‌పై స్థానిక హైస్కూల్‌కు తోటి విద్యార్థినులతో కలసి రోజూ వెళ్లి వస్తోంది. రోజూలాగే గురువారం కూడా పాఠశాలకు సహచర వి ద్యార్థినులతో వెళ్తుండగా అడ్డురోడ్డు గుండా వస్తూ మలుపు వద్ద మెయిన్‌ రో డ్డు ఎక్కుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాన్స్‌కో వ్యాన్‌ బలంగా ఢీకొంది. పా ర్వతి రోడ్డుపైకి తుళ్లి పడిపోగా తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెం దింది. విద్యార్థి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.రవికుమా ర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మృత్యువై వచ్చి...
రోజూలాగే పాఠశాలకు బయలుదేరిన పార్వతిని ట్రాన్స్‌కో వ్యాన్‌ మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మలుపు వద్ద నెమ్మదిగా వస్తున్న పార్వతి సైకిల్‌ను అతి వేగంతో వస్తున్న ట్రాన్స్‌కో వ్యాను ఢీకొట్టి ఆమె కాలి పైనుంచి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం విడిచిన పార్వతిని కళ్లారా చూసిన సహచర విద్యార్థినులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.  పార్వతి మృతితో కన్నవారి గ్రామం పిన్నవలసతో పాటు పెద్దమ్మ గ్రామమైన డొంకినవలసలో విషాదం అలముకొంది. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

పరామర్శించిన డీఈఓ
విద్యార్థిని పార్వతి దుర్మరణం చెందిన విషయం తెలుసుకొన్ని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, ఉప విద్యాశాఖాధికారిణి రమణమ్మ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థిని మృతదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. విద్యా శాఖ తరఫున రూ.పది వేలు ఆర్థిక సాయం తల్లిదండ్రులకు అందజేశారు. బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బేబీనాయన సంతాపం తెలిపి రూ.5వేలు సాయం అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం దాస్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని తమ సంతాపం తెలిపారు.  

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)