amp pages | Sakshi

పదవ తరగతి విద్యార్థిని హత్య

Published on Thu, 08/02/2018 - 09:20

కర్ణాటక, మాలూరు: పదవ తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి హత్య చేసిన ఘటన బుధవారం సాయంత్రం పట్టణంలో సంచలనం సృష్టించింది. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఇందిరా నగర్‌లో ఉంటున్న విద్యార్థిని (15) హత్యకు గురైంది. ఆమె పట్టణంలోని బాలగంగాధర నాథ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతోంది. నిత్యం ఇంటి నుంచి నడుచుకుని పాఠశాలకు వెళ్లి వచ్చేది. బుధవారం సాయంత్రం కూడా పాఠశాల వదలగానే నడుచుకుని ఇంటికి వస్తున్న సమయంలో కొంతమంది యువకులు బాలికను అడ్డగించి రాయితో తలపై బలంగా కొట్టారు. దీంతో విద్యార్థిని ఘటనా స్థలంలోనే మరణించింది. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని హంతకులు రైల్వే బ్రిడ్జి కింద పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. రైల్వే బ్రిడ్జికింద శవమై పడి ఉండడాన్ని పట్టణ ప్రజల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. వెంటనే పట్టణ పోలీసులు ఎస్‌ఐ మురళి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నిందితులను అరెస్టు చేయాలని ధర్నా
విద్యార్థిని హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కరవే కార్యకర్తలతో పాటు పలు సంఘాల కార్యకర్తలు నగరంలోని మారికాంబ సర్కల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎస్‌ఐ మురళి ఆందోళనతో కారులతో చర్చించి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చినా శాంతించని ఆందోళన కారులు ఎస్పీ రావాలని పట్టు బట్టారు. తమ కుమార్తెను ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని రోదించారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కూడా పెద్ద సంఖ్యలో జనం చేరడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)