amp pages | Sakshi

వరుస చోరీలు.. పోలీసులకు సవాల్‌

Published on Sat, 10/06/2018 - 14:11

కర్నూలు, ఆదోని: వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. 20 రోజుల క్రితం ఆదోని పట్టణంలో దోపిడీకి పాల్పడగా.. శుక్రవారం ఎమ్మిగనూరులో నాలుగు ఎరువుల దుకాణాల్లో అందిన కాడికి దోచుకెళ్లారు. రెండూ కూడా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు కావడం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆదోని ఘటన మరవకముందే ఎమ్మిగనూరులో దొంగలు పడటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులను ఛేదించడంలో పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే చోరీలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  

అతీగతీలేని దోపిడీ కేసు..
ఆదోని పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌ రోడ్డులో గత నెల 21న ఐదు జిన్నింగ్, ప్రెస్సింగ్‌ పరిశ్రమలు, ఒక రైస్‌ మిల్లు, 30న పట్టణంలోని మున్సిపల్‌ ఎంఎం రోడ్డులోని స్టేట్‌ బ్యాంకు ఏటీఎంలో చొరబడి దోపిడీకి తెగబడ్డారు. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్‌ జిన్నింగ్, ప్రెస్సింగ్‌ ఫ్యాక్టరీలో మాత్రం రూ.82వేలు దోచుకెళ్లారు. మిగిలిన పరిశ్రమల్లో ఏమీ దొరకలేదనే అక్కసుతో సెక్యూరిటీ గార్డులను చితక బాది వెళ్లారు. పట్టణంలోని ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎంలో క్యాష్‌ బాక్స్‌ పగలక పోవడంతో ఉత్తి చేతులతో వెనుదిరిగారు. ఏటీఎంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పని చేయలేదు. విద్యుత్‌ సరఫరా లేక పోవడం, బ్యాటరీలు పని చేయక పోవడం వల్లే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వారి కదలికలు నమోదు కాలేదని తెలుస్తోంది. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్‌లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. టీడీపీ ఆదోని ఇన్‌చార్జ్‌ మీనాక్షినాయుడుకు చెందిన సులోచనమ్మ జిన్నింగ్, ప్రెస్సింగ్‌ ఫ్యాక్టరీతో సహా మరో నాలుగు పరిశ్రమల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు. దోపిడీకి యత్నించిన ముఠా సభ్యులు ముసుగు ధరించినట్లు జేపీఆర్‌ పరిశ్రమలో నమోదైన సీసీ పుటేజీలను బట్టి తెలుస్తోంది. అయినా ఇంత వరకు అతీగతీ లేదు.  

వారు..వారేనా?
ఆదోనిలో దోపిడీకి పాల్పడిన వారు శుక్రవారం ఎమ్మిగనూరులో చోరీ చేసిన వారు ముసుగులు ధరించి ఉండటం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం అక్కడా.. ఇక్కడా ఐదుగురే పాల్పొనడం బట్టి చూస్తే వారు వీరేనా అనే అనుమానం కలుగకమానదు. ఇక రెండు చోట్ల కూడా జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలనే ఎన్నుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆదోని ఘటనలో కేసు దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు ఉన్నప్పటికీ దోపిడీ ముఠాను పోలసులు ఎందుకు గుర్తించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఠాను వెంటనే అరెస్ట్‌ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.   

నాలుగు ఎరువు దుకాణాల్లో చోరీ
ఎమ్మిగనూరు రూరల్‌: పట్టణంలోని గురువారం అర్ధరాత్రి నాలుగు ఎరువుల దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని శ్రీనివాస సర్కిల్‌లో నందీశ్వర హైబ్రిడ్‌ సీడ్స్, శ్రీ లక్ష్మీనరసింహ రసాయన ఎరువులు, వాల్మీకి సర్కిల్‌ వద్ద మౌనేశ్వర ట్రేడర్స్, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లోని మల్లికార్జున ట్రేడర్స్‌ షాపుల్లో అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఈ నాలుగు షాప్‌లకు డోర్స్‌ను తొలగించి లోపలికి దూరి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మల్లికార్జున ట్రేడర్స్‌లో రూ.70 వేల నగదు, నందీశ్వర హైబ్రిడ్‌ షాప్‌లో రెండు వెండి కాయిన్స్, మౌనిక ట్రేడర్స్‌లో రూ.2 వేల నగదు పట్టుకెళ్లారు. ఉదయం టీ తాగటానికి వచ్చిన వారు గమనించి యజమానులకు సమచారమందించడంతో వారు అక్కడికి చేరుకొని పట్టణ పోలీసులకు చేరవేశారు. పట్టణ సీఐ వి.శ్రీధర్, ఎస్‌ఐ హరిప్రసాద్‌ సంఘటనా స్థలాలను పరిశీలించి చోరీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని టౌన్‌ సీఐ వి.శ్రీధర్‌ విలేకరులకు తెలిపారు. 

Videos

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)