amp pages | Sakshi

కుటుంబం పాశవిక హత్య; చేతనైతే కాపాడుకో!

Published on Wed, 01/22/2020 - 17:19

రాయ్‌పూర్‌: బిడ్డతో సహా దంపతులను పాశవికంగా హతమార్చాడో దుండగుడు. అనంతరం బాధితుల బంధువులకు ఫోన్‌ చేసి తాను చేసిన దురాగతాన్ని వివరించాడు. ఆ తర్వాత హత్య చేయడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ ఓ లేఖను ఘటనాస్థలంలో వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాయ్‌పూర్‌కు చెందిన మంజు శర్మ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం రవి శర్మతో వివాహం జరిగింది. వీరికి ఓ బిడ్డ ఉంది. కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవి శర్మ ఇంట్లోకి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. రవి, మంజులపై పాశవికంగా దాడికి పాల్పడి వారిని హతమార్చాడు. అనంతరం వారి బిడ్డను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ముగ్గురికి నిప్పంటించి తగులబెట్టాడు. అనంతరం మంజు తల్లికి ఫోన్‌ చేసి.. ‘నీ కూతురు, అల్లుడు మంటల్లో తగులబడుతున్నారు. వచ్చి చూసుకో.. చేతనైతే కాపాడుకో’ అని చెప్పాడు.

ఈ క్రమంలో ఆమె పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ అప్పటికే మంజు కుటుంబం దహనమైపోయింది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. బాధితుల ఇంటి గోడలపై రక్తపు మరకలు కనుగొన్నట్లు తెలిపారు. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. రవి, మంజు కాళ్లూ-చేతులను తాళ్లతో కట్టేసి.. హత్య చేసిన తర్వాత నిందితుడు వారిని దహనం చేశాడని వెల్లడించారు. మృతదేహాల వద్ద ఓ లేఖ కనుగొన్నామని.. అందులో మంజు వ్యక్తిత్వం మంచిది కాదని.. ఆమె కారణంగా తన సోదరుడు చనిపోయాడని.. అందుకే ఆమె కుటుంబాన్ని హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడన్నారు. కాగా ఘటన జరిగినప్పటి నుంచి మంజు మాజీ భర్త పరారీలో ఉన్నాడని.. ఇందులో అతడి ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)