amp pages | Sakshi

రైలుపట్టాలపై మిస్టరీ

Published on Tue, 10/09/2018 - 13:35

నెల్లూరు(క్రైమ్‌): జనావాసాల నడుమ ఓ వ్యక్తి కాలు పడిఉండటం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేసింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాలు ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో రైలుపట్టాలపై రెండు మృతదేహాలు ఉండటం అందులోని ఓ మృతదేహానికి సంబంధించిన కాలుగా నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం ఓ కుక్క కాలును తీసుకువచ్చి నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం శివాలయం వీధిలో పడవేసింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు భయాందోనకు గురై హత్య జరిగిందంటూ ప్రచారం చేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

సంతపేట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పాపారావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కాలును పరిశీలించారు. అప్పటికే వెంకటేశ్వరపురం గోదాముల సమీపంలో, వెంకటేశ్వరపురం బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలున్నట్లు సమాచారం రావడంతో ఆయన రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఒక మృతదేహానికి తల, కాళ్లు లేకపోవడంతో దానికి సంబంధించిన కాలును కుక్క తీసుకువచ్చిందని నిర్ధారించారు. ఈక్రమంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివాలయం వీధిలో లభ్యమైన కాలు, రైల్వే ట్రాక్‌పై ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అలాగే సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై బాలకృష్ణ మృతదేహాలను చూశారు. రెండు మృతదేహాల్లో ఒకటి నెల్లూరు జీఆర్‌పీఎఫ్‌ పరిధిలోకి రావడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. రెండో మృతదేహాన్ని కావలి జీఆర్‌పీఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు.

ఒకరి ఆచూకీ లభ్యం
కావలి పరిధిలోని రైల్వేట్రాక్‌పై మృతిచెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. మచిలీపట్నంకు చెందిన కాశి శివసాయి ప్రవీణ్‌ (23) సివిల్‌ ఇంజినీర్‌. అతను నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ వెంకటేశ్వరపురంలో తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. సోమవారం వెంకటేశ్వరపురం గోదాముల సమీప రైలుపట్టాలపై మృతిచెంది ఉన్నాడు. ఘటనా స్థలంలో దొరికిన సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతుడ్ని కావలి రైల్వే పోలీసులు గుర్తించారు.

పలు అనుమానాలు
కొద్దిదూరం వ్యవధిలోనే రైలుపట్టాలపై ఇద్దరు మృతిచెందారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకున్నారా? రైలు ఢీకొని మృతిచెందారా? మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌