నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విమానాశ్రయంలో రెండు కేజీల బంగారం పట్టివేత
Published on Sat, 12/29/2018 - 04:14
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం డీఆర్ఐ అధికారులు చేపట్టిన తనిఖీలో భాగంగా...దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన మైక్రోఓవెన్ను పరిశీలించారు.
అందులోని బ్యాటరీలో మొత్తం 46 వెండి పలకలు కనిపించాయి. వీటి పైపూతను తీసివేయడంతో మొత్తం 2.46 కిలోల బంగారం బయటపడింది. వీటి విలువ సుమారు రూ.66 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags