amp pages | Sakshi

ఎంతపనాయే కొడుకా..!

Published on Wed, 04/24/2019 - 08:10

బెల్లంపల్లి: కుమారుడికి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అమెరికా పంపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆ కుమారుడు సైతం బాగానే చదువుకుంటున్నాడు. సుమారు నాలుగేళ్లుగా అక్కడే విద్యాబోధన చేస్తున్నాడు. త్వరలో మంచి ఉద్యోగం సాధిస్తాడని, ఇక తమ కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కానీ.. వారి ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది. ఉన్నత చదువుల కోసం అందనంత దూరం వెళ్లి.. అక్కడి నుంచే అటే ఈ లోకాన్నే విడిచాడన్న వార్త వారిని శోక‘సంద్రం’లో ముంచింది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆ యువకుడు అక్కడే ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

అమెరికాలో జరిగిన ఈ సంఘటన బెల్లంపల్లిలోని అతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయ్యో కొడుకా.. ఎంత పనాయే అంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరమూ కావడం లేదు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి అశోక్‌నగర్‌బస్తీకి చెందిన రెడ్డి రాజం, మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రావణ్‌ (27) అమెరికాలోని టెక్సాస్‌ ప్రాంతం రిచ్‌మండ్‌లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. హైదరాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్‌ అమెరికాలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్‌) చేయడానికి 2014లో వెళ్లాడు. 2016లోనే ఎంఎస్‌ పూర్తి చేసినా.. డబుల్‌ ఎంఎస్‌ కోసం అక్కడే ఉండిపోయాడు.

ఈస్టర్‌ సందర్భంగా ఈనెల 19న (భారత కాలమాన ప్రకారం 20వ తేదీ) స్నేహితులతో కలిసి ఫ్లోరిడా ప్రాంతంలోని డెస్టిన్‌ బీచ్‌కు వెళ్లాడు. సరదా కోసం సముద్రంలో దిగగా.. అలల వేగానికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులు శ్రావణ్‌ గల్లంతైనట్లు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్‌చేసి శ్రావణ్‌ చనిపోయినట్లు నిర్ధారించారు. 

అదే చివరి ఫోన్‌కాల్‌..
రాజం రెండో కొడుకు రవికుమార్‌ వరంగల్‌లో ఇరిగేషన్‌ శాఖలో డీఈగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె సాత్విక పుట్టినరోజు కావడంతో రాజం, మాలతి మూడురోజుల క్రితం వరంగల్‌కు వెళ్లారు. శ్రావణ్‌ తన తల్లిదండ్రులతో ఆదివారం ఉదయం ఫోన్‌లో మాట్లాడాడు. యోగా క్షేమాలు తెలుసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే శ్రావణ్‌ విగతజీవి అయ్యాడన్న వార్త విని పించగానే.. వారి శోకానికి అంతులేకుండా పోయింది.  శ్రావణ్‌ మృతిచెందాడన్న వార్తతో అశోక్‌నగర్‌లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి.

మూడురోజుల తరువాతే చివరిచూపు
శ్రావణ్‌ మృతదేహం బెల్లంపల్లికి చేరుకోవడానికి మరోమూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా లీగల్‌ వ్యవహారాలు పూర్తయ్యాకే శవాన్ని భారత్‌కు పంపనున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అక్కడి ఆస్పత్రిలో భద్రపర్చి ఉంచినట్లు సమాచారం. కొడుకు మృతదేహం కోసం ఆతల్లిదండ్రలు, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌