amp pages | Sakshi

ఎవరిదీ మృతదేహం?

Published on Thu, 07/23/2020 - 08:29

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా అనుమానిస్తున్నట్లు సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. బోరబండ సమీపంలోని సున్నం చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని సనత్‌నగర్‌ పోలీసులు గత నెల 20న స్వాధీనం చేసుకున్నారు.  మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రాథమిక ఆధారాలను బట్టి హతమార్చి, ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి చెరువులో పడేసినట్లు తేల్చారు.  30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళ కుడి చేతిపై ‘ఎస్‌’ అక్షరం టాటూ వేసి ఉంది. ఆచూకీ తెలిసిన వారు సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు 9490617132 లేదా ఎస్‌ఐ 7901113461 లేదా పోలీసుస్టేషన్‌కు 8331013246 ఫోన్‌ చేసి తెలపాలని కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Videos

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)