amp pages | Sakshi

మామ పింఛన్‌ డబ్బుల కోసం భర్తను..

Published on Thu, 07/09/2020 - 12:32

రెబ్బెన(ఆసిఫాబాద్‌): భర్తకు కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భార్యే తన పాలిట మృత్యువుగా మారింది. మామ పింఛన్‌ డబ్బుల కోసం భర్తతో గొడవపడి చివరికి కొడవలితో భర్త గొంతు కోసి హతమార్చింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి  మండలంలోని రోళ్లపాడులో చోటుచేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్‌ వివరాల ప్రకారం... చింతకుంట్ల శ్రీను(30), అంజలి అలియాస్‌ స్వప్న భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కొడుకు తిరుపతి, ఐదేళ్ల కూతురు సువర్ణ ఉన్నారు. భార్యాభర్తలకు మద్యం సేవించే అలవాటుతో బానిసలుగా మారారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో మద్యం సేవించి తరుచుగా గొడవ పడేవారు.

ఈ క్రమంలో మంగళవారం శ్రీను తండ్రి పోచయ్యకు పింఛన్‌ డబ్బులు వచ్చాయి. తండ్రి వద్ద నుంచి రూ.600 కొడుకు శ్రీను అడిగి తీసుకున్నాడు. సాయంత్రం ఆ విషయం భార్యకు తెలియటంతో డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవైంది. ఆ డబ్బులు తన వద్ద లేవని, ఖర్చు చేశానని శ్రీను చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. మంచంపై నిద్రిస్తున్న భర్తను అర్ధరాత్రి కొడవలితో గొంతుకోసింది. దీంతో శ్రీను కేకలు వేయడంతో పక్క షెడ్డులో నిద్రిస్తున్న తండ్రి పోచయ్య ఇంట్లోకి వచ్చేసరికి స్వప్న పారిపోయింది. శ్రీను మెడపై రెండు, ఎడమ చెంపపై, చెవి కింది భాగంలో, ఎడమ రొమ్ముపై భాగంలో తీవ్రగాయాలై మృతి చెందాడు. బుధవారం విషయం తెలుసుకున్న రెబ్బెన సీఐ ఆకుల అశోక్, ఎస్సై  రమేష్‌ సంఘటనా స్థలానికి చేసుకుని విచారణ చేపట్టారు. శ్రీను తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తల్లీదండ్రులు దూరం కావడంతో వారి పిల్లలు అనాథులుగా మారారు. కళ్ల ఎదుటే విగతజీవిగా పడిఉన్న తండ్రి మృతదేహం వద్ద చిన్నా రుల రోదన స్థానికులను కంటతడి పెట్టించాయి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)