మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంత్రగాడి ఇంటి పక్కన ఓ మహిళ..
Published on Tue, 06/18/2019 - 10:33
సాక్షి, చిత్తూరు : మంత్రగాడిని ఆశ్రయించిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం రేపుతోంది. రాపకుప్పం మండలం వీర్నమల పంచాయతీ కుల్లిగానూరుకు చెందిన పవనమ్మ గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో కుప్పంకు చెందిన హకీమ్ అక్బర్ అనే మంత్రగాడిని సంప్రదించారు. మూడు రోజుల పాటు ఆ మహిళ ఆ మంత్రగాడి ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ మంత్రగాడి ఇంటి పక్కనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపినగర్ సమీప వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరగ్గా.. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కారులో బాధితురాలి ఇంటికి తరలించారు. మంత్రగాడి వల్లే పవనమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
#
Tags