ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శాంతి కపోతాలపై ‘విష’ ప్రయోగం
Published on Fri, 09/30/2016 - 00:55
వెంకటగిరి : శాంతి కపోతాలపై గుర్తుతెలియని వ్యక్తులు విషం ప్రయోగించారు. 11 పావురాలను చంపిన ఘటన గురువారం వెంకటగిరిలో జరిగిందిది. మూగజీవాల ప్రేమికుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవినాష్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నాడు. పావురాలపై ఉన్న ప్రేమతో పలు ప్రాంతాల నుంచి సేకరించిన పావురాలను వెంకటగిరిలో తన నివాసంలో ఉంచి పెంచుకుంటున్నాడు. ఆయన నివాసం పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు ఆ పావురాలను చంపే పథకం వేసి బియ్యం గింజల్లో విషం కలిపి వాటికి మేతగా వేయడంతో అవి తిన్న సుమారు 11 పావురాలు మృతి చెందాయి. పావురాలు మృతి చెందడంపై ఆందోళన చెందిన అవినాష్ వాటిని పరిశీలించగా విషం కలిపిన బియ్యం తిని చనిపోయినట్లు గుర్తించాడు. తన నివాసం పరిసరాలను పరిశీలించగా ఓ చోట రెండు పిడికెళ్ల బియ్యం కనిపించడంతో వాటిని వాసన చూసి విషం కలిపినవి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బియ్యంను ల్యాబ్ టెస్ట్కు పంపినట్లు అవినాష్ తెలియజేశారు.
#
Tags