మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
144 సెక్షన్
Published on Tue, 09/20/2016 - 23:09
- తెరుచుకోని దుకాణాలు
- మూతబడిన విద్యాసంస్థలు
నాగిరెడ్డిపేట:
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేట మండల విలీనంపై ఏర్పడిన చిచ్చుతో పోలీసులు మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం నుంచే పోలీసులు రోడ్లపై వచ్చి గుంపులుగా ఉండకూడదని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లాకు మద్దతుగా ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్షలకు సంబంధించిన టెంట్ను తీసేయించారు. అలాగే, ప్రజా ఐక్య వేదిక కార్యాలయం వద్ద ఉన్న వారందరినీ అక్కడి నుండి పంపించారు. మండల కేంద్రంలో ఎలాంటి బంద్లు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. జిల్లాకేంద్రం నుండి వచ్చిన క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీం) పోలీసులతో ఎస్సై సీతారాములు మండల కేంద్రంలో పలుమార్లు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలయ్యేలా ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు చెందిన ఎస్సైలు పూర్ణేశ్వర్, రాజశేఖర్ వారి బలగాలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా కూడా నలుగురు నిలబడవద్దని పోలీసులు ఇచ్చిన సూచనలతో వ్యాపారులు సైతం వారి దుకాణాలను మూసివేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి బందోబస్తు చేపట్టాయి. దీంతో మండల కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు.
#
Tags