బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
22వేల క్యూసెక్కుల నీటి విడుదల
Published on Fri, 02/17/2017 - 00:18
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయం నుంచి గత బుధవారం నుంచి గురువారం వరకు దిగువ ప్రాంతాలకు 21,927 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం దిగువ నాగార్జున సాగర్కు 20,154 క్యూసెక్కుల నీటిని, బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 1,703 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 75 క్యూసెక్కులను విడుదల చేశారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.026 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.994 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటి పరిమాణాన్ని పెంచి 225 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 55.0461 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 842.10 అడుగులుగా నమోదైంది.
#
Tags