నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చానమిల్లి ఆవులకు మూడు బహుమతులు
Published on Sun, 01/08/2017 - 23:47
చానమిల్లి (నిడమర్రు) : తూర్పుగోదావరి జిల్లా నామవరంలోని భారతీ విద్యాభవన్స్ లో జరిగిన అఖిలభారత అవుల, గేదెల అందాల పోటీల్లో చానమిల్లి సర్పంచ్ వెజ్జు రామారావుకు చెందిన ఆవులు 3 బహుమతులు గెలుచుకున్నాయి. ఈ పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించారని రామారావు ఆదివారం చెప్పారు. సుమారు 250 పైగా ఆవులు పాల్గొన్న ఈ పోటీలు ఆదివారంతో ముగిసినట్టు తెలిపారు. వివిధ జాతి ఆవుల అందాల పోటీల్లో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆవులకు బహుమతులు లభించినట్టు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఆవులను పోటీల్లో నామినేషన్ చేయించినట్టు తెలిపారు. కొంగనూరు గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఉమాదేవి గిత్త ద్వితీయ బహుమతి, కపిల గిత్త అందాల పోటీల్లో వెజ్జు ఆహాన్ గిత్తకు ద్వితీయ బహుమతి, ఒగోలు గిత్త ఆందాల పోటీల్లో వెజ్జు నరేష్ గిత్తకు ప్రత్యేక బహుమతి లభించినట్టు చెప్పారు. ఈ పోటీలు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనా«థ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలిపారు.
#
Tags