Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
ఏసీబీ వలలో మరో పెద్ద చేప
Published on Sat, 12/24/2016 - 18:04
విశాఖపట్నం: రోడ్లు, భవనాల శాఖ డిప్యూటీ ఈఈ పాత్రో ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఏకకాలంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ లోని పాత్రోకు సంబంధించిన ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని బుర్జాలో పాత్రో బంధువుల ఇటిలో సోదాలు కొనసాగాయి. విజయనగరం జిల్లా కురుపాం మండలం మొండెంకల్లోనూ ఏసీబీ తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో సుమారు. రూ.4.08 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించారు. 15 ఇళ్ల స్థలాలు, 1.5 లక్షల నగదు, 29 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండగా, అలాగే 600 గ్రాముల బంగారం, కారు, బైక్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags