amp pages | Sakshi

చిత్రహింసలు పెట్టి చంపేశారు

Published on Sat, 05/07/2016 - 02:44

వారం క్రితమే నా కొడుకును పట్టుకుని నిర్బంధించారు: ఆజాద్ తండ్రి
 
 నర్సీపట్నం: తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి పోలీసులు అమానుషంగా చంపేశారని ఆజాద్ తండ్రి లక్ష్మణరావు ఆరోపించారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి మృతదేహాలను గురువారంరాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘ ప్రతి నిధులు శుక్రవారం ఉదయమే ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుడు ఆజాద్ తండ్రి లక్ష్మణరావు విలేకరులతో మాట్లాడుతూ 15 మంది పోలీసులు కాల్పులు జరిపితే కేవలం ఒకే ఒక్క తూటా ఆజాద్‌కు తగలడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారం క్రితమే ఆజాద్‌ను పట్టుకుని నిర్బంధించి, కన్ను సైతం పీకి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు.

మావోయిస్టు కీలక నేతల మృతదేహాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం  చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఎన్‌కౌంటర్ మాదిరిగానే పోస్టుమార్టం సైతం బూటకంగానే జరిగిందన్నారు. అజాద్ సోదరి ఝాన్సీ మాట్లాడుతూ మానవత్వం లేకుండా మృతదేహాలను మూటలుగా కట్టి వదిలేశారన్నారు.  కేవలం మీడియాలో వచ్చిన వార్తలు చూసి తామంతా ఇక్కడకు చేరుకున్నామని వివరించారు.  కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆజాద్ కుటుంబసభ్యులు, ఆనంద్ సోదరుడు నాగేశ్వరావు నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. కమల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోనే భద్రపరుస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఎన్‌కౌంటర్ వాస్తవమే..
విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్

విశాఖ జిల్లా కొయ్యూరు మండ లం యు.చీడిపాలెం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్ వాస్తవమేనని విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఇక్కడ తెలి పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురిని ఆజాద్ (ఈస్ట్ డివిజన్ చీఫ్), ఆనంద్(ఈస్ట్‌డివిజన్ డిప్యూటీ చీఫ్), కమల (ఏరియా కమిటీ మెంబరు)గా గుర్తించామన్నారు.  కొయ్యూరు మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా శిక్షణలో ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణార్థం పోలీ సు లు  ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు.  ఆజాద్ కుటుంబసభ్యులు, బంధువులు, పౌరహక్కుల సంఘం నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం నిబంధనలకు లోబడి పూర్తిచేశామని చెప్పారు. ఘటనాస్థలంలో లభ్యమైన విప్లవ సాహిత్యం, ఏకే 47 తుపాకీ, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, 9 ఎంఎం పిస్టల్, రేడియో, జీపీఎస్, డెరైక్షనల్ మైన్, డే బైనాక్యులర్, 9 కిట్ బ్యాగులను ఆయన పరిశీలించారు. 

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)