amp pages | Sakshi

బోగస్‌ బీమా

Published on Sat, 07/23/2016 - 22:29

వెలుగులోకి వచ్చిన నకిలీ వాహన ఇన్సూ్యరెన్స్‌ కుంభకోణం 
పోలీసు అదుపులో ప్రధాన సూత్రధారి 
ఆర్టీవో కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు  
 
నరసరావుపేట టౌన్‌ : పేటలో నకిలీల మకిలీ రోజురోజుకు పెరిగిపోతోంది. నేరాలను అదుపుచేసేందుకు ఎన్నో సాంకేతిక మార్గాలు అన్వేషిస్తున్నా నరసరావుపేట వ్యాపారులు వాటిని అధిగమించి తమ నకిలీ వ్యాపారాలు .. కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు నూనె, పాలు, ఎరువులు, పురుగుమందుల్లో నకిలీలు హల్‌చల్‌ చేసిన వైనం విధితమే. ఇటీవల చోటుచేసుకొన్న మూడు కోట్ల వే బిల్లులు.. రూ.30 లక్షల మనియార్డర్ల కుంభకోణం మరువక ముందే తాజాగా నకిలీ బీమా పత్రాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కెళితే వాహన బీమాకు సంబంధించి ఓ వ్యక్తి సాంకేతిక పరంగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలను సష్టించి అనేక మందికి విక్రయించాడు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీవో) కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకొని గత కొన్నేళ్ళుగా తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించాడు. ఆర్టీవో కార్యాలయం వద్ద ఉండే ఏజెంట్ల వద్ద వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని నకిలీ బీమా పత్రాలను వారికి అందిస్తున్నాడు. వేలల్లో నకిలీ బీమా పత్రాలు వాహనదారులకు ఇప్పటికే చేరాయి. యజమానులు తమ వాహనాలకు బీమా కట్టామని మురిసిపోయారేకానీ ఏ మేరకు మోసపోయరన్నది గ్రహించలేకపోవడంతో ఈ తంతు కొనసాగింది. 
 
 బయట పడింది ఇలా..
నరసరావుపేట ఆర్టీవో కార్యాలయ ఏజెంట్‌ వద్ద విజయవాడకు చెందిన ఓ వ్యక్తి వాహనానికి సంబంధించి బీమా చేశాడు. ఇటీవల అధికారుల దాడుల్లో నకిలీ బీమాపత్రంగా దాన్ని గుర్తించారు. దీంతో కంగుతిన్న వాహన యజమాని విషయాన్ని ఏజెంట్‌కు తెలిపాడు. దీంతో ఏజెంట్‌ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట రూరల్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ బీమా కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన బరంపేట చాకిరాలమెట్టకు చెందిన శ్రీనివాస్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 
 వేలల్లో బాధితులు.. లక్షల్లో మోసం..
 కొన్నేళ్ళుగా నరసరావుపేట, గుంటూరు, పిడుగురాళ్ళ, ఆర్టీవో కార్యాలయాల వద్దకు వెళ్లి వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్‌లు చేస్తామని ఏజెంట్‌లతో ఒప్పందం కుదుర్చుకొని శ్రీనివాస్‌ తన కార్యకలాపాలను చక్కబెడుతున్నట్లు పోలీస్‌ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అతను ఇచ్చిన సమాచారంతో బీమా పత్రాల తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీకి సంబంధించి లెటర్‌ ప్యాడ్లు, స్టాంపులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.  విషయం కొంతమంది వాహనదారులకు తెలియటంతో లబోదిబో మంటున్నారు. ఇప్పటివరకు నరసరావుపేట పరిధిలో 400 వాహనాల వరకు నకిలీ ఇన్సూ్యరెన్స్‌లు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)