విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతు
Published on Fri, 08/19/2016 - 20:30
మధురానగర్ :
స్నేహితులతో కలిసి రైవస్ కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. వివరాలలోకి వెళితే పసుపుతోటకు చెందిన దువ్వరపాటి శివ (15) స్నేహితులతో కలిసి మధురానగర్ శివాలయం వద్ద రైవస్ కాలువలో ఈత కొట్టడానికి వెళ్లాడు. శివాలయం సమీపంలోని వంతెన పైనుంచి కాలువలోకి దూకుతూ ఈత కొడుతూ స్నేహితులతో ఉల్లాసంగా గడిపాడు. శివ వంతెన పైనుంచి మూడుసార్లు దూకి ఈత కొట్టిన తరువాత నాలుగో సారి దూకాడు. దూకిన తరువాత ఎంతకీ పైకి రాకపోవడంతో భయపడిన స్నేహితులు పారిపోయారు. సమాచారం తెలుసుకున్న శివ తండ్రి శాంతారావు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రైవస్కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మాచవచం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైవస్ కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ ఉధృతికి కొట్టుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పదో తరగతి చదివే కుమారుడు గల్లంతుకావడంతో తండ్రి శాంతారావు చేస్తున్న ఆర్తనాదాలు చూపరులను కంటతడిపెట్టించాయి. ఈ ఘటనతో పసుపుతోటలో విషాధచాయలు అలముకున్నాయి.
#
Tags