రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీపీటీ–2 వరి రకాన్ని అమ్మడం నేరం
Published on Mon, 02/13/2017 - 23:04
నంద్యాల అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేని బీపీటీ–2 అనే వరి రకాన్ని అమ్మడం చట్టరీత్యా నేరమని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ గోపాల్రెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి రకం కాదన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నంద్యాల పరిసర ప్రాంతాల్లోని రైతులు కొందరు ఈ రకాన్ని సాగు చేస్తున్నారని చెప్పారు. పంట సాగు వలన వచ్చే సమస్యలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖలు బాధ్యత వహించబోవన్నారు. విశ్వవిద్యాలయం రూపొందించిన బీపీటీ–5204 సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విత్తనం కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యేవరకు రసీదు ఉంచుకోవాలని సూచించారు.
#
Tags