ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
Published on Sun, 07/31/2016 - 21:52
మరో ఇద్దరి తీవ్ర గాయాలు
పీలేరు:ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ మదనపల్లె 2వ డిపోకు చెందిన నాన్స్టాప్ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం పీలేరు శివారు మదనపల్లె మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పీలేరు పట్టణంలోని పద్మాపతి నగర్కు చెందిన బాష కుమారుడు షాదిక్(18), మోహిత్(17) కావలిపల్లె పంచాయతీ ఒంటిల్లుకు చెందిన ద్విచక్ర వాహనాల మెకానిక్ ఆఫ్రిది(17) ఇందిరమ్మ కాలనీలోని ఫిరోజ్ కల్యాణ మండపంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా డిగ్రీ కళాశాల సమీపంలో తిరుపతి నుంచి మదనపల్లెకు వెళుతున్న బస్సు ఢీకొంది. షాదిక్ బస్సు కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సురేష్బాబు అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యువకులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. షాదిక్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. షాదిక్ పీలేరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్బాబు తెలిపారు.
Tags