నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి
Published on Fri, 07/29/2016 - 22:13
జంగారెడ్డిగూడెం : అంత్యపుష్కరాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్(జేసీ) పి.కోటేశ్వరరావు ఆదేశించారు. పట్టిసీమ, గూటాల పుష్కర ఘాట్లలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగుండాలని, చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రత్యేకంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. రెండు ఘాట్లలోను 12 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు జేసీ తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి, ఒక స్పీడ్ బోటును కూడా సిద్ధం చేయాలని సూచించారు. గోదావరిలో ఒకవేళ నీటి మట్టం తగ్గినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్లలోను పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. అవసరమైతే బస్సులను కూడా పెంచాలని సూచించారు. ఘాట్ల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మద్యం దుకాణం లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. గోదావరిలో బోట్లలో నిరంతరం పహరా నిర్వహించాలన్నారు. భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన పురోహితులను కూడా నియమించాలని సూచించారు. ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, మద్ది ఈవో పి.వివ్వనాథరాజు, అసిస్టెంట్ ఎంవీఐ శ్రీనివాస్, పోలవరం తహసీల్దార్ ముక్కంటి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#
Tags