amp pages | Sakshi

జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత

Published on Thu, 12/01/2016 - 01:30

స్తంభించిన లావాదేవీలు ఖాతాదారుల ఆగ్రహం
నేడు అందుబాటులోకి కొత్త రూ.500 నోట్లు

జాతీయ బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించారుు. గంటల తరబడి బ్యాంకుల ముందు బారులు తీరిన ఖాతాదారులకు నగదు అందకపోవడంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నారుు.  అధికారులను  నిలదీశారు. నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు.

తిరుపతి (అలిపిరి): జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఆర్బీఐ నుంచి నగదు అందడం లేదు. దీంతో బ్యాంకు శాఖల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. చిత్తూరు, తిరుపతి, మదనపల్లె వంటి ప్రధాన ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలకు సకాలంలో నగదు రాలేదు. బుధవారం ఉదయం 10 గంటలకు  బ్యాంకుల వద్దకు చేరుకున్న ఖాతాదారులు మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి వున్నా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంకుల్లో నగదు లేకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ మండిపడ్డారు. చివరికి చేసేది లేక వెనుదిరగాల్సివచ్చింది.

జిల్లాకు అందిన అరకొర నగదు
జిల్లా అవసరాల రీత్యా రూ.1800 కోట్లు అవసరమైతే ఆర్బీఐ నుంచి రూ.109 కోట్లు మాత్రమే అందారుు. అందులో రూ.9 కోట్లు మాత్రమే రూ.500 నోట్లు  వున్నాయని జిల్లా అధికారులు ప్రకటించారు. బుధవారం కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావాల్సి వున్నా.. వాటిని బ్యాంకులకు చేరవేయడానికి ఎక్కవ సమయం పట్టడంతో గురువారం ప్రధాన బ్యాంకు శాఖల్లో కొత్త రూ.500 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి రానున్నారుు.

ఏటీఎంలలో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాలు చాలావరకు పూర్తిస్థారుులో పనిచేయడం లేదు. తిరుపతి నగరంలో తిలక్ రోడ్డు, మదనపల్లెలో ఆర్టీసీ బస్టాండు ప్రాంతం, చిత్తూరులో జిల్లా కలెక్టరేట్‌లోని ఏటీఎంలు మినహా మరే ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థారుులో పనిచేయలేదు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, పుంగనూరు వంటి ప్రాంతాల్లో ఏటీఎంలు అడపాదడపా పనిచేసినా నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ కావడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)