ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మేయర్కు తగిన గుణపాఠం చెపుతాం
Published on Sun, 10/30/2016 - 01:17
- సీఐటియూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు
నెల్లూరు(సెంట్రల్):
తమ సమస్యలు పరిష్కరించమని అడిగిన కార్మికులను పోలీసులతో కొట్టించిన కార్పొరేషన్ మేయర్ అబ్దుల్అజీజ్కు తగిన గుణపాఠం చెపుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు హెచ్చరించారు. కార్పొరేషన్లో కార్మికులపై శుక్రవారం జరిగిన దాడికి నిరసనగా నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ పాలన చూస్తుంటే తనమాట కాదన్నవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ నిరంకుశంగా వ్యవరిస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేపట్టినా లాఠీచార్జీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని, ఆయన అవినీతిని పక్కన పెట్టి కార్మికులపై ప్రతాపం చూపించడం సిగ్గు చేటన్నారు. కాగా గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం.
#
Tags