వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దేశ భవితకు రాజ్యాంగం దిక్సూచి
Published on Sun, 11/27/2016 - 01:08
కాకినాడ సిటీ : అందరికీ సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం దేశ భవిష్యత్కు ఒక దిక్సూచి వంటిదని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ అన్నారు. శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం లాకుల సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు పవిత్రమైనదని, ఈ రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర పరిపాలన, ప్రజలకు బాధ్యతలు, హక్కులు కల్పిస్తూ ఒక ఆదర్శమైన పాలనకు మార్గం చూపారన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ అసమాన ప్రతి భను చూపారన్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన కోసం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో చర్చ జరపవలసిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, బీసీ కార్పొరేన్ ఈడీ ఎం.జ్యోతి, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, సీపీఓ మోహన్ రావు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డీడీ చినబాబు, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్, డీపీఆర్వో ఎం.ఫ్రాన్సిస్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు దనురాశి శ్యామ్ సుందర్, దళిత సంఘాల నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు, ఠాగూర్, గూడాల కృష్ణ, రవికుమార్, జి.వెంకటేశ్వరరావు, కుమార్ పాల్గొన్నారు.
#
Tags