Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అర్హులందరికీ పంట రుణాలివ్వాలి
Published on Thu, 07/28/2016 - 23:39
ఓడీ చెరువు: అర్హులైన రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలంటూ సీపీఐ నాయకులు, రైతులు గురువారం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ఆంజనేయులు, మున్నా తదితరులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంకులో రుణాలు కావాలంటే దళారులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. దీంతో చాలా మంది రైతులకు పంట రుణాలు అందక బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. బ్యాంకు అధికారులు కొంత మంది బ్రోకర్ల ద్వార రుణాలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులు బ్యాంక్ మేనేజర్ను సంప్రదిస్తే కొత్త రుణాలు ఇచ్చేది లేదని వెనక్కి పంపుతున్నారని రైతులు వాపోయారు. పంట రుణం కావాలని వచ్చే ప్రతి రైతుకూ కొత్తగా రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు రమణ, రహీం, రైతులు పాల్గొన్నారు.
#
Tags