జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం
Published on Mon, 08/22/2016 - 00:42
దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం
- l‘బహుజన సాహిత్యం రాజకీయ విముక్తి’ సదస్సులో కవులు, రచయితలు, మేధావులు ్ఠ
హన్మకొండ కల్చరల్ : విలువైన దళిత బహుజనుల సాహిత్యం మరింత విస్తృత స్థాయిలో రావాలని ఓయూ విశ్రాంతాచార్యులు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్, ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత ఆచార్య వై.బీ.సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ‘బహుజన సాహిత్యం – రాజకీయ విముక్తి’ అంశంపై బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో హన్మకొండ కిషన్పురలోని మాస్టర్జీ హైస్కూల్లో ఆదివారం సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వర్ అధ్యక్షతన జరిగిన మొదటి సమావేశంలో ఆచార్య వై.బీ.సత్యనారాయణ, జి.లక్ష్మీనర్సయ్య, డాక్టర్ పం తంగి వెంకటేశ్వర్లు, సుందర్రాజు పాల్గొన్నారు. సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ దళిత బహుజన కవులు సమానత్వాన్ని కోరుకుంటూ కుల నిర్మూలనకు బాధ్యతతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. మరోవైపు పాలకులు అన్నివర్గాల సాహిత్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.
తెలంగాణ సాహిత్యానికి అన్యాయం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దళిత బహుజన సాహిత్యానికి తీరని అన్యాయం జరిగిందని రచయిత, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ అన్నా రు. మధ్యాహ్నం యాకుబ్ అధ్యక్షతన జరిగిన రెండవ సమావేశంలో అతిథులుగా సంగిశెట్టి శ్రీనివాస్,స్కైబాబా,నలిగంటి శరత్, తక్కెళ్ల బాలరాజు, సాయిని నరేందర్, డాక్టర్ చింతం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. సాయంత్రం డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ముగిం పు సమావేశంలో ఆచార్య నన్నె రామస్వామి, డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు, డాక్టర్ మల్లేశ్వర్రావు, పి.చంద్, సూర్యపల్లి శ్రీనివాస్ ప్ర సంగించారు. సొన్నాయిల కృష్ణవేణి, ఎలి కట్టె శ్రీనివాస్, చింతం నాగరాజు, దానబోయిన రవి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
#
Tags