ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అధికారులకు మోదం.. భక్తులకు ఖేదం!
Published on Fri, 09/09/2016 - 23:58
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపైన భక్తులు ఏ క్యూలైన్లో వచ్చినప్పటికీ అమ్మవారి ములవిగ్రహాన్ని దర్శనం చేసుకునే సమయంలో అర్చకులు శఠగోపం పెట్టి కుంకుమ ప్యాకెట్లు ఇచ్చేవారు. దీంతో భక్తులు ఎంతో సంతృప్తి చెందేవారు. చివరకు ఉచిత దర్శనం లైన్లో కూడా ఇదే పద్ధతి ఉండేది. అయితే ఇప్పుడు తిరుపతి తరహాలో అంటూ.. శఠగోపం పెట్టే విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. రూ.300 టికెట్ కొనుక్కుని వచ్చే భక్తులు, వీవీఐపీలకు మాత్రమే అమ్మవారి సన్నిధిలో శఠగోపం (పాదుకలు) అర్చకులు పెట్టేందుకు ఈవో సూర్యకుమారి అనుమతిచ్చారు. రూ.20 టికెట్ కొనుగోలు చేసి ముఖమండపం ద్వారా వచ్చే భక్తులకు అమ్మవారి సన్నిధిలో శఠారీ లభించదు. వస్త్రంతో తయారు చేసిన హుండీలు పెట్టిన చోటకు వచ్చిన తరువాత అక్కడ పాదుకలతో ఆశీర్వాదం లభిస్తుంది. ఇక సాధారణ భక్తుల పరిస్థితి మరీ దారుణం. దర్శనం చేసుకుని రావి చెట్టు వద్దకు వచ్చిన తరువాత అక్కడ అర్చకుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించి శఠగోపం పెట్టించుకోవాల్సి ఉంది. అర్చకులు ఉండేందుకు కనీసం స్పష్టమైన ప్రదేశం కూడా లేదు. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని విషయం స్పష్టమవుతోంది.
సంప్రదాయాలకు తిలోదకాలు..
ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ శఠారీని పళ్లెంపై పెట్టి ఉంచడం చూస్తుంటాం. ఇక్కడ ఈ పద్ధతులకు దేవస్థానం అధికారులు తిలోదకాలు ఇచ్చారు. అర్చకులు దక్షణ వసూలు చేస్తున్నారంటూ బల్ల, శఠారీ, పళ్లాన్ని ఈవో తీయించి వేశారు. వాస్తవంగా గతంలో ఈవోలు ఇదే తరహాలో తీయించేందుకు ప్రయత్నించగా, శఠారీ కింద ప్లేటు తీయించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు వేదపండితులు చెబుతున్నారు. చట్టాలు, సంప్రదాయాలకు దేవస్థానంలో తిలోదకాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
#
Tags