amp pages | Sakshi

‘విల్లు’ విరాళాలకు టీటీడీ వెసులుబాటు

Published on Wed, 02/15/2017 - 22:21

నిబంధనలు సడలించిన టీటీడీ
ఆస్తి విరాళం ఇచ్చినా.. మరణానంతరం స్వీకరణ
పెరిగిన టీటీడీ ఖర్చులు.. కొనుగోళ్లు


తిరుమల: వెంకన్నకు విరాళాలు వెల్లువలా వచ్చి చేరుతున్నాయి. భక్తులు నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల రూపంలో కానుకలు సమర్పిస్తున్నారు. అదే స్థాయిలో విజ్ఞప్తులు కూడా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీటీడీ కూడా విరాళాల సేకరణలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఒకవ్యక్తి తన ఆస్తిని విల్లు రాసి టీటీడీకి రిజిస్ట్రేషన్‌ చేసినప్పటికీ తన జీవిత కాలం వరకు అనుభవించుకుని, మరణానంతరం ఆస్తిని దేవస్థానం స్వీకరించేలా నిబంధనలు సడలించారు. ఆమేరకు తిరుపతికి చెందిన ఏ.బసవ పున్నయ్యకు మూడంతస్తుల భవనం ఉంది. అందులో ఒక అంతస్తులతో తాను నివాసం ఉంటున్నారు. మరో రెండు అంతస్తులు అద్దెకు ఇచ్చి, ఆ మొత్తంతో జీవితం సాగిస్తున్నారు. ఆ భవనాన్ని ఇటీవల టీటీడీకి విరాళంగా సమర్పించారు. విల్లులో తన మరణాననంతరం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆమేరకు టీటీడీ విరాళాలు స్వీకరించే నిబంధనలపై ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. కొన్ని నిబంధనలు సడలించి కానుకగా టీటీడీకి ఇచ్చిన ఆస్తులు దాతలు జీవిత కాలం వరకు అనుభవించుకుని, వారి మరణం తర్వాత టీటీడీ స్వాధీనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో చాలామంది భక్తులు ముందుకు వస్తారని అంచనాకు వచ్చారు. దీంతో భక్తుడు బసవ పున్నయ్య ఆస్తి స్వీకరణకు నిబంధనలు సడలింపు ఇస్తూ మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించింది.

అసంపూర్తి అతిథిగృహం ఆధునికీకరణకు ఆమోదం
తిరుమలలో సన్నిధానం అతిథిగృహం సమీపంలోని మలేషియాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు వీఎం చంద్రకు 2002 అతిథిగృహం నిర్మాణం కోసం టీటీడీ స్థలం కేటాయించింది. అయితే, అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. దీనిపై దాతకు టీటీడీ నోటీసులు ఇచ్చినా ఎటువంటి సమాధానం లేదు. దీంతో అసంపూర్తిగా ఉన్న ఆ అతిథిగృహాన్ని టీటీడీనే ఆధునికీకరించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది. ప్రస్తుతం రూ.53 లక్షలతో ఆధునికీకరించాలని నిర్ణయించింది. దీనివల్ల యేటా రూ.1.5 కోట్ల వరకు టీటీడీకి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

టీటీడీలో పెరుగుతున్న ఖర్చులు
టీటీడీలో యేటా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులతోపాటు కొనుగోళ్లపై భారీగా ఖర్చు చేస్తోంది. గత ఏడాది కొనుగోళ్లకు రూ.362.60 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి రూ.472.35 కోట్లు ఖర్చు చూపారు. ఫలితంగా కార్పస్‌ఫండ్‌ పెట్టుబడులు  2016–17లో మొత్తం రూ.757 కోట్లు  ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.475 కోట్లకు తగ్గాయి. ఇక 2017–2018 సంవత్సరానికి శాశ్వత  ఉద్యోగుల జీత భత్యాలకు రూ.575 కోట్లు, ఔట్‌సోర్స్‌ కార్మికులకు రూ.200 కోట్లు, ఇంజినీరింగ్‌ పనులకు రూ.200 కోట్లు కేటాయించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)