amp pages | Sakshi

కరువు కోరలు

Published on Fri, 03/03/2017 - 23:51

 చింతలపూడి/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలో కరువు కోరలు చాస్తోంది. గత ఏడాది తొలకరిలో తప్ప గడచిన ఆరు నెలల్లో వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. సాగునీటికి కొరత ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు వేసవికి ముందే ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మెట్ట మండలాల్లో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లోని పరిస్థితి మరీ 
అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే చాలాచోట్ల్ల చెరువులు ఎండిపోవడంతో పశువులకు సైతం తాగునీరు అందటం లేదు. ప్రాజెక్టుల్లో  నీరు ఉంటే భూగర్భ జలాలు ఎంతోకొంతో ఆశాజనకంగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తొలకరి వానలు వచ్చేవరకు అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే తప్ప కష్టాల నుంచి గట్టెక్కలేమని ఇరిగేష¯ŒS డీఈ అప్పారావు చెబుతున్నారు.
చెరువులు, ప్రాజెక్టులు వెలవెల
జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు ఉండగా చిన్ననీటి పారుదల కింద జల్లేరు జలాశయంతోపాటు 1,398 సాగునీటి చెరువులున్నాయి. వీటిలో తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు కింద 43,500 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న నీటిపారుదలకు సంబంధించి జల్లేరు జలాశయం, చెరువుల కింద కలిపి 1,19,284 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రబీ పంట లకు నీరు విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో నీరు క్రమేణా తగ్గిపోతోంది.
ఎర్రకాలువ పరిస్థితి ఇదీ
చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నుంచి వచ్చే నీటి వనరులే ఎర్రకాలువకు ఆధారం. ఇక్కడి నుంచి సుమారు 21 కిలోమీటర్ల మేర నీరు ప్రవహించి ఎర్రకాలువ ప్రాజెక్టులో కలుస్తోంది. అలాగే సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టుకు సైతం ఈ కాలువే ప్రధాన వనరుగా ఉంది. జలాశయం నీటిమట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 80 మీటర్లకు చేరుకుంది. ఈ ఏడాది రబీలో ఈ ప్రాజెక్టు నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్టు ఇరిగేష¯ŒS అధికారులు చెబుతున్నారు. 
ఎండిన నందమూరి విజయసాగర్‌
ఏటా వర్షాకాలంలో వృథాగా పోతున్న వేలాది క్యూసెక్కుల ఎర్రకాలువ వరద నీటిని పంటలకు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం సమీపంలో నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. దీనికింద అధికారికంగా సుమారు వెయ్యి ఎకరాలు, అనధికారికంగా మరో వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఎర్రకాలువ వట్టిపోవడంతో నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్ట్‌ సైతం ఎండిపోతోంది.
ఎత్తిపోతలు అంతంతే..
ఎర్రకాలువపై ఆధారపడి ఉన్న మరో ప్రాజెక్టు బొర్రంపాలెంలోని వెంగళరాయ ప్రాజెక్టు. దీనికింద సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అంతేకాక వెంగళరాయ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కామవరపుకోట మండలంలో సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మూడేళ్లుగా ఎత్తిపోతల నీటితో ఆ మండలం సస్యశ్యామలమైంది. పై రెండు ప్రాజెక్టులు ఎర్రకాలువపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడాది రబీలో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అధికారులు అనుమతించారు. ఎర్రకాలువ వట్టిపోవడంతో ఎత్తిపోతల పథకానికి నీరందని పరిస్థితి నెలకొంది.
తగ్గుతున్న తమ్మిలేరు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో 3 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాన్ని నిర్మించారు. ప్రాజెక్టు దిగువన పశ్చిమ గోదావరి జిల్లాలో 4,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,969 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇదికాక సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చింతలపూడి మండలంలోని 27 గ్రామాలకు తమ్మిలేరు తాగునీటి పథకం నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటేనే చుట్టుపక్కల మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 336 అడుగుల  నీటిమట్టం ఉంది. దీంతో పలు గ్రామాల్లో భూగర్భ జలాల నీటిమట్టం పడిపోతోంది. పంటల పరిస్థితి ప్రమాదంలో పడింది.  
 

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)