అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మునిగిన కోటిలింగాల లోలెవల్ వంతెన
Published on Tue, 08/02/2016 - 22:46
వెల్గటూరు : వెల్గటూరు మండలంలోని కోటిలింగాల ప్రధాన రహదారిలో అలుగు ఒర్రెపై ఉన్న లో లెవల్వంతెన ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్లో మంగళవారం మునిగిపోయింది. గ్రామానికి బయట నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ప్రజలు వంతెన పైనుంచి మూడు ఫీట్ల లోతు నీళ్లతో నడిచి వెళ్తున్నారు. నీటిమట్టం పెరుగుతున్నందున స్కూల్ ఆటోలు మధ్యాహ్నమే పిల్లలను దిగబెట్టి వెళ్లాయి. బుధవారం తెల్లవారేసరికి నీటిమట్టం మరింత పెరిగి కోటిలింగాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి. నాలుగు రోజులుగా వంతెన మునిగి పోతుందని అధికారులను ‘సాక్షి’ హెచ్చరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటం గమనార్హం. రాకపోకలు నిలిచిపోవటంతో నిర్వాసితులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. సంబంధిత అధికాకరులు స్పందించి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
#
Tags